మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రోజువారీగా పెద్ద సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 11, గురువారం నాడు 1,877 కరోనా కేసులు, 5 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,66,243 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,162 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 1,971 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 79,06,291 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.02 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.83 శాతంగా నమోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 11,790 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మొత్తం 8,35,50,468 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY