జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. 17వ విడతలో భాగంగా 23 రాష్ట్రాలకు రూ.4,730.41 కోట్లు, శాసనసభ కలిగి ఉన్న 3 కేంద్రపాలిత ప్రాంతాలకు (ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి) లకు రూ.269.59 కోట్లు కలిపి మొత్తం రూ.5000 కోట్లు విడుదల చేయబడ్డాయి. ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.8,539.66 కోట్లు కలిపి మొత్తం రూ.లక్ష కోట్ల పరిహారాన్ని కేంద్రం అందించినట్టు పేర్కొన్నారు. మొత్తం జీఎస్టీ పరిహారం అంచనాలో ఇది 91 శాతమని తెలిపారు. ఇక 17 విడతల్లో తెలంగాణ రాష్ట్రానికి రూ.1940.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కు రూ.2222.71 కోట్లు విడుదల అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ