కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పలు యూనివర్సిటీల డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
డిగ్రీ, పీజీ పరీక్షలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి జారీచేసిన మార్గదర్శకాలు:
- డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్ 20 నుంచి పరీక్షలు నిర్వహించవచ్చు.
- చివరి సెమిస్టర్ విద్యార్థులకు మాత్రమే యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహించాలి.
- మిగిలిన సంవత్సరాలకు సంబంధించిన సెమిస్టర్లకు నవంబర్ లేదా డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలి.
- అన్ని సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్ చేయాలి.
- పరీక్షల సమయాన్ని ప్రస్తుతం రెండు గంటలకు కుదించాలి.
- ప్రశ్నాపత్రంలో ఆప్షన్స్ ఎక్కువగా ఇవ్వాలని సూచన.
- ప్రాజెక్టు వర్క్స్, సెమినార్లు, వైవా ఇతర సంబంధిత కార్యక్రమాలు ఆన్లైన్లోనే నిర్వహించాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu