భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 24248 కరోనా పాజిటివ్ కేసులు, 425 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూలై 6, సోమవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,97,413 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రష్యాను ను దాటేసిన భారత్ 3 వ స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 6, ఉదయం 8 గంటల వరకు) :
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 6,97,413
కొత్తగా నమోదైన కేసులు (జూలై 5 – జూలై 6 (8AM-8AM) : 24, 248
నమోదైన మరణాలు : 425
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 4,24,433
యాక్టీవ్ కేసులు : 2,53,287
మొత్తం మరణాల సంఖ్య : 19693
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu