ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ను ఆదివారం నాడు విడుదల చేశారు.
7 వ తేదీ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడినుంచి హెలికాఫ్టర్ లో ఇడుపులపాయకు చేరుకొని అక్కడ అతిధి గృహంలో బస చేస్తారు. 8 వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం ఆర్.కే వ్యాలీ వద్ద ఆర్జీయూకేటికి చేరుకొని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే 3 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇడుపులపాయ అతిధి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తాడేపల్లికి ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu