జూలై 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్

Andhra CM YS Jagan Mohan Reddy, AP CM To Tour Kadapa District, AP CM YS Jagan, AP CM YS Jagan will Tour in Kadapa District, Ap Political News, YS Jagan Tour in Kadapa District, YSR, YSR Birth Anniversary, YSR Birth Anniversary Celebrations

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూలై 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ను ఆదివారం నాడు విడుదల చేశారు.

7 వ తేదీ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడినుంచి హెలికాఫ్టర్ లో ఇడుపులపాయకు చేరుకొని అక్కడ అతిధి గృహంలో బస చేస్తారు. 8 వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం ఆర్.కే వ్యాలీ వద్ద ఆర్జీయూకేటికి చేరుకొని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే 3 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇడుపులపాయ అతిధి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తాడేపల్లికి ప్రయాణం కానున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =