భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల భారీగా కనిపించడంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వరుసగా రెండు రోజూ 7 వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన అప్డేట్ ప్రకారం.. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు) మొత్తం 1,94,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,171 కొత్త కోవిడ్-19 పాజిటివ్లు వెలుగుచూశాయి. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 51,314గా ఉంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,39,515కి చేరింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 52 వేలకు దిగువకు రావడం కొంత ఊరటనిచ్చే విషయం. ఇక 24 గంటల వ్యవధిలో ఇక కరోనా మహమ్మారి బారిన పడి అత్యధికంగా కేరళలో 15 మంది, ఢిల్లీలో 6గురు, ఉత్తర్ప్రదేశ్లో 4గురు, ఛత్తీస్గఢ్లో ముగ్గురు, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఇద్దరు, మేఘాలయా, జమ్మూ అండ్ కశ్మీర్, పంజాబ్, చండీగఢ్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,508కి చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 29, ఉదయం 8 గంటల వరకు):
- గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,94,134
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 28–ఏప్రిల్ 29 (8AM-8AM)] : 7,171
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,49,39,515
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 9,669
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,43,56,693
- కరోనా రికవరీ రేటు : 98.70 శాతం
- యాక్టివ్ కేసులు : 51,314
- కొత్తగా నమోదైన మరణాలు : 40
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,508
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (2,20,66,63,094) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE