భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 10 వేల లోపే నమోదవడం కొంచెం ఊరట కలిగించింది. గత పది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు సోమవారం కొంత తగ్గుముఖం పట్టాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు) మొత్తం 1,08,436 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,111 కొత్త కోవిడ్-19 పాజిటివ్లు వెలుగుచూశాయి. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60వేల మార్కును దాటింది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 4,48,27,226కి చేరినట్లయింది. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 27 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,141కి చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 17, ఉదయం 8 గంటల వరకు):
- గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,08,436
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 16–ఏప్రిల్ 17 (8AM-8AM)] : 9,111
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,48,27,226
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 6,313
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,42,35,772
- కరోనా రికవరీ రేటు : 98.68 శాతం
- యాక్టివ్ కేసులు : 60,313
- కొత్తగా నమోదైన మరణాలు : 27
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,141
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (220,66,26,522) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE