దేశంలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 7591 పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు

Corona in India 7591 Positive Cases 45 Deaths Reported in Last 24 Hours, India Reports 7591 New Covid19 Cases, India Tolls 45 COVID Deaths, India reports 7591 Covid Cases In 24 Hours, Mango News, Mango News Telugu, 7591 New Covid Cases In India, 7591 Covid Positive Cases In India, Coronavirus In India, India Logs 7591 COVID Cases, COVID19 Latest News And Updates, COVID-19 Vaccine, Booster Dose News And Live Updates

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 8 వేలలోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 7,591 పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఆగస్టు 29, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,44,15,723 కు, మరణాల సంఖ్య 5,27,799 కి పెరిగిందని తెలిపారు.

అలాగే గత 24 గంటల వ్యవధిలో 9,206 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,38,02,993 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.62 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 84,931 (0.19%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 1,65,751 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 88.52 (88,52,08,552) కోట్లు దాటింది. రోజువారీ పాజీటివిటీ రేటు 4.58 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 2.69 శాతంగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 8 =