తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1417 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1417 కేసులతో కలిపి సెప్టెంబర్ 13, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,513 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 974 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 1,27,007 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లోనే 2479 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 30,532 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు 34,427 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 21,69,339 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 58,431 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu