దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కూడా పెరిగాయి. వరుసగా ఎనిమిదో రోజు కూడా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో వినియోగదారులపై రోజురోజుకి భారం పెరుగుతుంది. ఇవాళ పెట్రోల్పై లీటరుకు 30 పైసలు, డీజిల్పై లీటరుకు 35 పైసలు ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మెట్రో నగరాలు, పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీల అధికారులు పేర్కొంటున్నారు.
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు (లీటరుకు):
- న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ.89.29, డీజిల్ రూ.79.70
- కలకత్తా : పెట్రోలు ధర రూ. 90.54, డీజిల్ రూ.83.29
- ముంబై : పెట్రోలు ధర రూ.95.75, డీజిల్ రూ.86.72
- చెన్నై : పెట్రోలు ధర రూ.91.19, డీజిల్ రూ.84.44
- హైదరాబాద్: పెట్రోలు ధర రూ.92.84, డీజిల్ రూ.86.93
- బెంగళూరు: పెట్రోలు ధర రూ.91.97, డీజిల్ రూ.84.12
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ