దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చ్ 19 నుంచి మార్చ్ 31 వరకు జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి బుధవారం నాడు ప్రకటించారు. మార్చి 31 తర్వాత పరీక్షల రీషెడ్యూల్ను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) నేతృత్వంలో ఏప్రిల్ 5 నుండి 11 వరకు జరగాల్సిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
భారత్ లో రోజు రోజుకి కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు మొత్తం 170 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 32 విదేశీయులు ఉన్నారు. ఇటలీ నుండి 17 మంది, ఇండోనేషియా నుండి ఏడుగురు, ఫిలిప్పీన్స్ నుండి ముగ్గురు, లండన్ నుండి ఇద్దరు, కెనడా, ఇండోనేషియా మరియు సింగపూర్ దేశాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై పలు చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజిలు, యూనివర్సిటీలను మార్చ్ 31 వరకు మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మార్చ్ అన్ని రాష్ట్రప్రభుత్వాలుకు ఆదేశాలు జారీ చేసింది.
[subscribe]