భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. మే 28, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,58,333 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6566 కరోనా పాజిటివ్ కేసులు, 194 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా దేశంలో ప్రతిరోజూ 6వేలకు పైగానే పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.
దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 4531 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 67,692 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 86,110 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళ నాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 56,948 కు చేరగా, వీరిలో 17,918 మంది కోలుకున్నారు, 1897 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో అత్యధికంగా 18,545, ఢిల్లీలో 15,257, గుజరాత్ లో 15,205 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 56,948
- తమిళనాడు – 18,545
- ఢిల్లీ – 15,257
- గుజరాత్ – 15,205
- రాజస్థాన్ – 7,816
- మధ్యప్రదేశ్ – 7,261
- ఉత్తర ప్రదేశ్ – 6,991
- పశ్చిమబెంగాల్ – 4,192
- ఆంధ్రప్రదేశ్ – 3,117
- బీహార్ – 3,036
- కర్ణాటక – 2,418
- పంజాబ్ – 2,139
- తెలంగాణ – 2,098
- జమ్మూ కశ్మీర్ – 1,921
- ఒడిశా – 1,600
- హర్యానా – 1,381
- కేరళ – 1,004
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu