దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా 9-13 వేల మధ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య మరోసారి 13 వేలు దాటింది. గత 24 గంటల్లో మొత్తం 6,56,410 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 13,313 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 2.03 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,33,44,958 కు చేరుకుంది. అలాగే కొత్తగా 38 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,941 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 10,972 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,27,36,027 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.60 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 83,990 (0.19%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధిక కరోనాకేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జూన్ 22 (8am)–జూన్ 23 (8am)):
- కేరళ – 4224
- మహారాష్ట్ర – 3260
- ఢిల్లీ – 928
- తమిళనాడు – 771
- ఉత్తర్ ప్రదేశ్ – 678
- కర్ణాటక – 676
- హర్యానా – 527
- తెలంగాణ – 434
- గుజరాత్ – 407
- పశ్చిమబెంగాల్ – 295
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY