భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత ఆరు రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,987 కరోనా పాజిటివ్ కేసులు, 331 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి చెందడం మొదలయ్యాక అత్యధికంగా ఒకేరోజున ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 9, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,66,598 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు కొత్తగా నమోదైన 331 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 7,466 కి చేరింది. మొత్తం కరోనా బాధితుల్లో 1,29,215 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,29,917 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజుల్లోనే దేశంలో 65 వేలకు పాజిటివ్ కేసులు, 1800 కు పైగా మరణాలు నమోదవడంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 5 వ స్థానంలో కొనసాగుతుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 9 June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 266,598
▶️ Active cases: 129,917
▶️ Cured/Discharged/Migrated: 129,215
▶️ Deaths: 7,466#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/vKo3MACWef
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 9, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu