దేశంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 22,123 కు చేరుకుంది. జూలై 11, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8,20,916 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకరోజు వ్యవధిలో అత్యధికంగా ఇన్ని కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 11, ఉదయం 8 గంటల వరకు) :
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,20,916
- కొత్తగా నమోదైన కేసులు (జూలై 10 – జూలై 11 (8AM-8AM) : 27,114
- నమోదైన మరణాలు : 519
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 5,15,386
- యాక్టీవ్ కేసులు : 2,83,407
- మొత్తం మరణాల సంఖ్య : 22,123
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu