దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 13, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,63,17,927 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 380 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,85,035కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 11 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 95.59 శాతం:
దేశంలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య 11 లక్షలు (11,17,531) దాటింది. ఇక కొత్తగా 84,825 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,47,15,361 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 95.59 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. అలాగే జనవరి 12, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 69,73,11,627 కు చేరుకుంది. జనవరి 12న 18,86,935 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ