దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రాలు మరోసారి లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో బీహార్లో జూలై 16 నుంచి 31 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మంగళవారం నాడు ప్రకటించారు.
ఈ 15 రోజుల లాక్డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు. అన్నిరకాల షాపులు, మాల్స్ మరియు మతపరమైన ప్రదేశాలు మూసివేయబడతాయని పేరొన్నారు. కాగా బీహార్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,853 కి చేరుకుంది. వీరిలో 13019 మంది కరోనా నుంచి కోలుకోగా, 143 మంది మరణించారు. మరోవైపు దేశంలో ఇప్పటికే బెంగుళూరు, పూణే నగరాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ కొనసాగుతుండగా, యూపీలో వీకెండ్ లో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu