తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో ఇటీవల రోజువారీ పాజిటివ్ కేసులు 2 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. కొత్తగా 2387 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 4, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,74,215 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 4,559 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,39,187 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.48 శాతంగా, మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,097 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,931 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 688, మేడ్చల్ మల్కాజ్గిరిలో 131, రంగారెడ్డిలో 131, ఖమ్మంలో 98, హనుమకొండలో 95, నల్గొండలో 88, మహబూబ్ నగర్ లో 84, కరీంనగర్ లో 77, సంగారెడ్డిలో 71, జగిత్యాలలో 65, సూర్యాపేటలో 65, భద్రాద్రి కొత్తగూడెంలో 63 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ