దేశంలో ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రధాన వాణిజ్య నగరమైన ముంబయిలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ముంబయి నగరంలో కొత్తగా ఒక్కరోజే 15166 పాజిటివ్ కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 8,33,628 కి చేరుకుంది. కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో నగరంలో మొత్తం మరణాల సంఖ్య 16,384 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 714 మంది కోలుకోవడంతో ఇప్పటికి రికవరీ అయినవారి సంఖ్య 7,52,726 కు చేరుకుంది. కాగా ముంబయిలో రికవరీ రేటు 90 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ