తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 1520 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 6,85,543 కి పెరిగింది. అలాగే కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,034 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక బుధవారం నాడు 42,531 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 209 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,75,341 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 94గా ఉంది. కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదవలేదు. కాగా 94 మందిలో ఇప్పటికే 43 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. మరోవైపు 68 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ