దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,610 కరోనా పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,37,320 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,55,913 కి పెరిగింది. గత నెలతో పోల్చితే దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్యా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 1,36,549 (1.25%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 11,833 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,06,44,858 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.33 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.43 శాతంగా నమోదైంది.
కాగా గత 24 గంటల్లో ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, లద్దాఖ్, అస్సాం, అండమాన్ అండ్ నికోబర్, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 17, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 20,79,77,229
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,09,37,320
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 16–ఫిబ్రవరి 17 (8AM-8AM)] : 11,610
- నమోదైన మరణాలు : 100
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,06,44,858
- యాక్టీవ్ కేసులు : 1,36,549
- మొత్తం మరణాల సంఖ్య : 1,55,913
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ