దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 13,742 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,30,176 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 104 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,56,567 కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసులు 1,46,907 (1.33%) కు తగ్గాయి. కొత్తగా మహారాష్ట్ర (6218), కేరళ (4034) మాత్రమే 1,000 కి పైగా కొత్త కేసులను నమోదు చేశాయి. అలాగే గత 24 గంటల్లో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, చండీగర్, అస్సాం, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
దేశంలో కరోనా రికవరీ రేటు 97.25 శాతం, మరణాల రేటు 1.42 శాతం:
అలాగే మరో 14,037 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,07,26,702 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.25 శాతం గానూ, మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 13,742 కేసులలో 86.15 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ