దేశంలో రోజురోజుకి కరోనా ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఈ వైరస్ వలన ప్రతి రోజు పెద్దసంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ సోదరుడు ఇషాన్ఖాన్ కూడా కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా క్రితం దిలీప్కుమార్ సోదరులు అస్లామ్ఖాన్, ఇషాన్ఖాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఇతర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఆగస్టు 21న అస్లామ్ఖాన్ మరణించారు. ఈ ఘటన మరువకముందే మరో సోదరుడు ఇషాన్ఖాన్ పరిస్థితి కూడా విషమించడంతో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టుగా తెలిపారు. ఇషాన్ఖాన్ కూడా కరోనాతో పాటుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. వెనువెంటనే సోదరుల మరణంతో బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ కుటుంబంలో విషాదం నెలకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu