దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. మార్చి, 2020 తర్వాత కరోనా రికవరీ రేటు గరిష్ఠానికి (98.19%) చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,42,60470 కు చేరుకుంది. అలాగే కరోనాతో 549 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,57,740 కు పెరిగింది. దేశంలో ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఏపీ, మిజోరాం, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. ఇక ప్రస్తుతం 1,61,555 (0.47%) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 13,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,36,41,175 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.19 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 30, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 60,70,62,619
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,42,60470
- కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 29–అక్టోబర్ 30 (8AM-8AM)] : 14,313
- నమోదైన మరణాలు : 549
- రికవరీ అయిన వారి సంఖ్య : 3,36,41,175
- యాక్టీవ్ కేసులు : 1,61,555
- మొత్తం మరణాల సంఖ్య : 4,57,740
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ