దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 14,545 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428 కు చేరుకుంది. కరోనాతో మరో 163 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,53,032 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే కోటి రెండు లక్షల 83 వేల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
కొత్తగా 18,002 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,02,83,708 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.78 శాతం గానూ, మరణాల రేటు 1.44 శాతంగా ఉంది. ప్రస్తుతం 1,88,688 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గడ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 14,545 కేసులలో 84.14 శాతం ఈ 8 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ