ఏపీలో 24 గంటల్లో 104 కరోనా మరణాలు, 11303 పాజిటివ్ కేసులు నమోదు

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus cases total, ap coronavirus updates district wise, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Total Corona Cases In AP,mango news

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 93,704 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 11303 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి 3 జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 1, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,04,388 కు చేరింది.

ఇక కరోనా వలన మరో 104 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 11034 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 18257 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 15,46,617 కు పెరిగింది. అలాగే ప్రస్తుతం 1,46,737 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,93,50,008 కరోనా పరీక్షలను నిర్వహించారు.

ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(11303):

  1. నెల్లూరు – 444
  2. తూర్పుగోదావరి – 2477
  3. గుంటూరు – 686
  4. విశాఖపట్నం – 985
  5. శ్రీకాకుళం – 693
  6. చిత్తూరు – 1536
  7. కర్నూల్ – 286
  8. విజయనగరం – 222
  9. ప్రకాశం – 935
  10. కడప – 323
  11. అనంతపూర్ – 953
  12. కృష్ణా – 647
  13. పశ్చిమగోదావరి – 1116
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =