దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు అందించిన మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి దాదాపు 165 కోట్లకు పైగా (165,20,44,645) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫిబ్రవరి 4, శుక్రవారం నాటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 10 కోట్లకుపైగా (10,71,21,576) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 21,2021 నుంచి కేంద్రప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యాక్సినేషన్ విధానంలో భాగంగా, దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75% కేంద్ర ప్రభుత్వం సమీకరించి రాష్ట్రాలకు/కేంద్రాలకు ఉచితంగా సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సిన్ ల లభ్యత పెరగడం, వ్యాక్సిన్ సరఫరా క్రమబద్ధీకరించడం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పక్రియ ఊపందుకుని, విజయవంతంగా కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ