దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,299 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,42,06,996 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో 2146, మహారాష్ట్రలో 1847, కర్ణాటకలో 1680, కేరళలో 1317, హర్యానాలో 1145, తమిళనాడులో 927, ఉత్తర్ ప్రదేశ్ లో 923 నమోదయ్యాయి. ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 605, ఆంధ్రప్రదేశ్ లో 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో మరో 53 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,879 కు పెరిగింది. .
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 11, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 87,92,33,251
- ఆగస్టు 10న నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,56,153
- కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 10–ఆగస్టు 11 (8AM-8AM)] : 16,299
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,42,06,996
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 19,431
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,35,55,041
- కరోనా రికవరీ రేటు : 98.53 శాతం
- యాక్టీవ్ కేసులు : 1,25,076 (0.28 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 53
- మొత్తం మరణాల సంఖ్య : 5,26,879
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY