తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో ఎట్ రిస్క్ దేశాల నుండి వారిలో ఇద్దరికీ, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. ఇప్పటివరకు ఎట్ రిస్క్ దేశాల వచ్చిన వారిలో ఆరుగురికి, నాన్ రిస్క్ దేశాల వచ్చిన వారిలో 31 మందికి, అలాగే ఒమిక్రాన్ సోకిన ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఒకరికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలడంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 38 కు చేరుకుంది. ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన మరో నలుగురి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మరోవైపు తెలంగాణలో కొత్తగా 182 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 22, బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,80,074 కి చేరింది. కరోనా వలన మరోకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,017 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.87 శాతంకాగా, మరణాల రేటు 0.59 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 196 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,72,447 కు చేరుకుంది. ప్రస్తుతం 3,610 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు బుధవారం నాడు 37,353 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,93,95,688 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 7,89,782 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ