దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 15,636 (0.04%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 2 వేలకుపైగా (2,483) కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,30,62,569 కు చేరుకుంది. అలాగే కరోనాతో 1399 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,23,622 కు పెరిగింది. పలు రాష్ట్రాలు కరోనా మరణాలను సవరించడంతో గత 24 గంటల మరణాల సంఖ్య భారీగా నమోదైంది. మరో 1,970 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,25,23,311 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 26, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 83,54,69,014
- ఏప్రిల్ 25న నిర్వహించిన కరోనా పరీక్షలు : 4,49,197
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,30,62,569
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 25–ఏప్రిల్ 26 (8AM-8AM)] : 2,483
- నమోదైన మరణాలు : 1399
- రికవరీ అయిన వారి సంఖ్య : 4,25,23,311
- యాక్టీవ్ కేసులు : 15,636
- మొత్తం మరణాల సంఖ్య : 5,23,622
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ