దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు కూడా 3 లక్షలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 66,836 కేసులు ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 24, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481 కు చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 2624 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,89,544 కు చేరుకుంది.
దేశంలో 25 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 83.49 శాతం:
ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ 25 లక్షలు (25,52,940) దాటింది. మరోవైపు 2,19,838 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,38,67,997 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 83.49 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.14 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్ 23, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 27,61,99,222 కు చేరుకుంది. గత 24 గంటల్లో 17,53,569 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ