కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. “కొవాగ్జిన్” పేరుతో భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సంయుక్తంగా తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్ ను మానవులపై ఫేజ్-1, ఫేజ్-2 ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్ పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ జూలై 15 న ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. మొత్తం 375 మందితో దేశంలోని 12 సెంటర్లలో ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే సెంటర్లలో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి కూడా ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu