దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. వరుసగా నాలుగో రోజు కూడా 3 లక్షలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,49,691 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 2767 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,92,311 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 26,82,751 (15.82%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి.
కొత్తగా మహారాష్ట్ర (67,160), ఉత్తర్ ప్రదేశ్ (37,944), కర్ణాటక (29,438), కేరళ (26,685), ఢిల్లీ (24,103), ఛత్తీస్ గడ్ (16,731), రాజస్థాన్ (15,355), తమిళనాడు (14,842), వెస్ట్ బెంగాల్ (14,281), గుజరాత్ (14,097) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 3,49,691 కేసులలో 74.53% శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 83.05 శాతం, మరణాల రేటు 1.13 శాతం:
దేశంలో మరో 2,17,113 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,40,85,110 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 83.05 శాతం గానూ, మరణాల రేటు 1.13 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ