దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 796 కరోనా కేసులు, 19 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,36,928 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,21,710 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మిజోరాం, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 946 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,25,04,329 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 11 వేల దిగువకు (10,889 – 0.03%) చేరుకున్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఏప్రిల్ 11 (8am)–ఏప్రిల్ 12 (8am)):
- కేరళ – 196
- మిజోరాం – 149
- ఢిల్లీ – 137
- హర్యానా – 54
- మహారాష్ట్ర – 41
- గుజరాత్ – 35
- కర్ణాటక – 34
- తమిళనాడు – 28
- తెలంగాణ – 24
- ఉత్తర్ ప్రదేశ్ – 14
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ