దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 89,129 కరోనా పాజిటివ్ కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,64,110 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి 8 రాష్ట్రాల్లోనే 81.42 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 6,58,909 (5.32%) కు చేరుకుంది. మరో 44,202 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,15,69,241 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 93.36 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.32 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (ఏప్రిల్ 2 8am – ఏప్రిల్ 3 8am) :
- మహారాష్ట్ర – 47913
- కర్ణాటక – 4991
- ఛత్తీస్ ఘడ్ – 4174
- ఢిల్లీ – 3594
- తమిళనాడు – 3290
- ఉత్తరప్రదేశ్ – 2953
- పంజాబ్ – 2873
- మధ్యప్రదేశ్ – 2777
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 481
- పంజాబ్ – 57
- ఛత్తీస్ ఘడ్ – 43
- ఉత్తర్ ప్రదేశ్ – 16
- మధ్యప్రదేశ్ – 16
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ