భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 96 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,652 కరోనా కేసులు, 512 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96,08,211 కు, మరణాల సంఖ్య 1,39,700 కు చేరుకుంది. కాగా దేశంలో ప్రస్తుతం 4,09,689 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు
మరోవైపు కొత్తగా 42,533 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 90,58,822 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 94.28 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ఇక డిసెంబర్ 4 నాటికీ దేశంలో14,58,85,512 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 11,57,763 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ