భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 97894 పాజిటివ్ కేసులు నమోదవగా, 1132 మంది మరణించారు. ఒకేరోజు వ్యవధిలో అత్యధికంగా ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 17, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 51,18,253 కు, మరణాల సంఖ్య 83,198 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.6 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 40 లక్షలు దాటింది. ఒకే రోజులో కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 40,25,079 కు చేరుకుంది. అలాగే కరోనా రికవరీ రేటు 78.6 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 10,09,976 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu