భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 55722 కేసులు, 579 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 19, సోమవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 75,50,273 కు, మరణాల సంఖ్య 1,14,610 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 66 లక్షలు దాటింది. ఒకే రోజులో 66,399 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 66,63,608 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 88.26 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.52 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 19, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 75,50,273
- కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 18–అక్టోబర్ 19 (8AM-8AM)] : 55,722
- నమోదైన మరణాలు : 579
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 66,63,608
- యాక్టీవ్ కేసులు : 7,72,055
- మొత్తం మరణాల సంఖ్య : 1,14,610
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu