మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలకు చేరువైంది. అక్టోబర్ 18, ఆదివారం నాడు కూడా 9060 కరోనా కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,95,381 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 42,115 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 11,204 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 13,69,810 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 85.86 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.64 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,82,973 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆదివారం నాటికీ మహారాష్ట్రలో 81,39,466 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu