కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 23,238 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 702 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.02 శాతంగా నమోదైంది. దీంతో మార్చి 23, బుధవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 65,29,049 కి చేరింది. ఇక కొత్తగా 903 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 64,55,655 కు చేరింది.
అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 6 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 53 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 67,476 కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 5,091 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 4,65,86,876 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ