మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కొత్తగా 10,107 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,34,880 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 237 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,15,390 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 10,567 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 56,79,746 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,36,661 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జూన్ 16, బుధవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 3,86,41,639
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 59,34,880
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 56,79,746
- కరోనా రికవరీ రేటు – 95.7%
- యాక్టీవ్ కేసులు – 1,36,661
- జూన్ 16న నమోదైన కేసులు – 10,107
- జూన్ 16న డిశ్చార్జ్ అయినవారు – 10,567
- జూన్ 16న నమోదైన మరణాలు – 237
- మొత్తం మరణాల సంఖ్య – 1,15,390
- కరోనా మరణాలు రేటు – 1.94%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ