తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడే కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ను బుధవారం నాడు అధికారులతో కలిసి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధునాతన హంగులతో రూ.81 కోట్ల వ్యయంతో జిల్లా కార్యాలయాల సమీకృత భవన సముదాయం, పోలీసు కమిషనరేట్ భవనాల నిర్మాణం చేపట్టారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా దుద్దెడ వద్ద G+2 విధానంలో ఈ జిల్లా కార్యాలయాల సమీకృత సముదాయం నిర్మించబడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ