భారతదేశంలో 4.7 మిలియన్ల కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా ఒక నివేదిక ఇచ్చింది. కాగా ఇది ఇండియా అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు ఎక్కువ కావడం విశేషం. అయితే దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య ఐదున్నర లక్షలుగా ఉంది. డబ్ల్యూహెచ్వో తన నివేదికలో.. కోవిడ్ -19 కారణంగా లేదా గత రెండేళ్లలో అధిక ఆరోగ్య వ్యవస్థలపై దాని ప్రభావంతో దాదాపు 15 మిలియన్ల మంది మరణించారని అంచనా వేసింది. ఆగ్నేయాసియా, యూరప్ మరియు అమెరికాలలో అత్యధిక మరణాలు సంభవించాయని నివేదికలో పేర్కొంది.
జనవరి 2020 మరియు డిసెంబర్ 2021 మధ్య భారతదేశంలో 4.7 మిలియన్ల కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించాయని, అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు ఎక్కువ, మరియు ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడవ వంతు కరోనా వైరస్ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ప్రకటించారు. కానీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అదే సమయంలో భారతదేశం లో కోవిడ్ కారణంగా 5,20,000 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు నీతి ఆయోగ్ సభ్యుడు పాల్ దీనిపై స్పందిస్తూ డబ్ల్యూహెచ్వో చెప్తున్న మరణాలకు కేవలం కరోనా మాత్రమే కారణం కాదని పేర్కొన్నారు. ఈ నివేదిక కోసం ఉపయోగించిన నమూనాల డేటా సేకరణ పద్ధతి సందేహాస్పదంగా ఉందని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ