మహారాష్ట్ర రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 4, శనివారం నాడు 1,357 కరోనా కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78,91,703కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,865 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 595 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 77,37,950 కు చేరుకుంది.
అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.05 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.87 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 5888 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 4294 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 769, పుణేలో 447, రాయగడ్ లో 135 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 8,10,35,276 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF