దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 12 లక్షలు దాటింది. సెప్టెంబర్ 22, మంగళవారం నాడు కూడా 18390 కరోనా కేసులు, 392 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,42,770 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 33, 407 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 20,206 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 9,36,554 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 75.36 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.69 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,72,410 మంది బాధితులు వివిధ ఆసుపత్రులు, ఐసొలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మంగళవారం నాటికీ మహారాష్ట్రలో 60,17,284 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu