దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 4, శుక్రవారం నాడు కూడా 19,218 కరోనా పాజిటివ్ కేసులు, 378 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,63,062 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 25,964 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 13,289 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 6,25,773 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.5 శాతంగా ఉండగా, మరణాల రేటు 3 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,10,978 మంది వివిధ ఆసుపత్రులు, ఐసొలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు శుక్రవారం నాటికీ మహారాష్ట్రలో 44,74,971 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu