మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుంది. ఇటీవల ఒకేరోజు వ్యవధిలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. సెప్టెంబర్ 6, ఆదివారం నాడు ఒక్కరోజే 23,350 కొత్త కేసులు నమోదుకాగా, 328 మంది మరణించారు. మహారాష్ట్రలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకోవడం ఆందోళనగా మారింది. ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,07,212 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 26604 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 7,826 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 6,44,400 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,35,857 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 6 నాటికీ మహారాష్ట్రలో 46,55,545 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu