దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే కొనసాగుతుంది. తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 2,338 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 31, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,58,087 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో 19 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,24,630 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 17,883 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.74 శాతం:
దేశంలో ప్రస్తుతం 17,883 (0.04%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,134 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,26,15,574 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. అలాగే మే 30, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 85.04 కోట్లకు (85,04,41,292) చేరుకుంది. మే 30న 3,63,883 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF