మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. ఈ క్రమంలో జూన్ 21, మంగళవారం నాడు 3,659 కరోనా కేసులు, 1 మరణం నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,41,762 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,889 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 3,356 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 77,68,958 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.82 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.86 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 24,915 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 8,16,65,314 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY