మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 5, గురువారం నాడు కూడా కొత్తగా 5246 పాజిటివ్ కేసులు, 117 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,03,444 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 44,804 కు పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటికి 92,50,254 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (నవంబర్ 5, గురువారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 17,03,444
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 15,51,282
- యాక్టీవ్ కేసులు – 1,06,519
- నవంబర్ 5 న నమోదైన కేసులు – 5246
- నవంబర్ 5 న డిశ్చార్జ్ అయినవారు – 11,277
- నవంబర్ 5 న నమోదైన మరణాల సంఖ్య – 117
- మొత్తం మరణాల సంఖ్య – 44,804
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ